Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పిన కేంద్రం..

వీధి వ్యాపారులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
, సోమవారం, 1 జూన్ 2020 (23:11 IST)
వీధి వ్యాపారులను ఆదుకునేందుకు రూ. 10 వేల వరకు రుణాన్ని అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్న వారందరికీ తోడ్పాటును అందించేందుకు కేంద్రం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూతను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
 
కేబినెట్ భేటి ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమై, ఆర్థికంగా దెబ్బతిన్న స్ట్రీట్ వెండర్స్‌కు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. దేశంలోని సుమారు 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్‌కు వెంటనే రూ.10 వేల వరకు రుణాలను అందించనున్నట్లు ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీఆర్ఏ భార్యపై వీఆర్వో లైంగిక వేధింపులు..