Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే : రాజస్థాన్ హైకోర్టు

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టే :  రాజస్థాన్ హైకోర్టు
, బుధవారం, 8 మే 2019 (10:01 IST)
సహజీవనంపై రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒక స్త్రీ, పురుషుడు ఇష్టపడి సహజీవనం చేయడం, ఆ తర్వాత విడిపోవడం వంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి జంటలకు రాజస్థాన్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్టేనని రాజస్థాన్ హైకోర్టు స్పష్టంచేసింది. 
 
ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తి కేసులో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది. 
 
ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆమెను పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో ఉపాధ్యాయురాలు తన భర్త నుంచి వేరుపడి అతడి వద్దకు వచ్చేసింది. 
 
అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించింది. సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన తీర్పు వెలువరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలియుగంలో దుర్యోధనుడు నరేంద్ర మోడీ : ప్రియాంకా గాంధీ