Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనీష్ సిసోడియా, కవితల జ్యుడీషియల్ కస్టడీ జూలై 31 వరకు పొడిగింపు

Kavitha

సెల్వి

, శుక్రవారం, 26 జులై 2024 (20:05 IST)
మద్యం పాలసీ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ నేత కె. కవితల జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు శుక్రవారం జూలై 31 వరకు పొడిగించింది. గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీరిద్దరినీ తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.
 
ఇదే స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ గురువారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తెలిపారు. సిసోడియా బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు గత వారం నోటీసులు జారీ చేసింది.
 
జూలై 29లోగా తమ సమాధానం ఇవ్వాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ),  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లను కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3 నెలల్లో 30వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్న టి.సర్కార్