Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిప

దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
, శనివారం, 24 మార్చి 2018 (12:28 IST)
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిపిన కోర్టు లాలూకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
1995, 1996 సంవత్సరాల్లో దుంకా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలపడంతో పాటు ఇప్పటికే లాలూని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా మార్చి 24 (శనివారం) ఏడేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే పూర్తయిన మూడు కేసుల్లోనూ లాలూకి శిక్ష పడింది. 
 
ప్రస్తుతం లాలూ జైలు జీవితం అనుభవిస్తున్నారు. మొదటి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నర ఏళ్లు, మూడో కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. నాలుగో కేసులో మాత్రం ఏడేళ్ల శిక్ష పడింది. ఇకపోతే, లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో ట్రాన్స్‌జెండర్లు.. అంతా వారి పుణ్యమే?