Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో పట్టాలెక్కనున్న తొలి ప్రైవేటు రైలు!!

train

ఠాగూర్

, బుధవారం, 8 మే 2024 (09:02 IST)
దేశంలో తొలి ప్రైవేటు రైలు త్వరలో పట్టాలెక్కనుంది. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ప్రైవేట్ రైళ్ళను నడిపేందుకు అనుమతించిన విషయం తెల్సిందే. దీంతో తొలి ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది. జూన్ నాలుగో తేదీన తిరువనంతపురం - గోవా రాష్ట్రాల మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ఎస్ఆర్‌ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగించనుంది. భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. రైలు ఆధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ రైలును నడుపనున్నాయి. 
 
తిరువనంతపురంలో ప్రారంభమయ్యే ఈ రైలు... త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, కోళికోడ్, కన్నూర్, కాసర్‌కోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది. ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ ఏసీ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ బోగీలు ఉంటాయి. ఈ రైల్లో ఒకేసారి 750 మంది ప్రయాణించవచ్చు. వైద్య నిపుణులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది కూడా ఈ రైలులో అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా ఈ రైలులో టూర్ ప్యాకేజీలను సిద్ధం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25 వేల టీచర్ల ఉద్యోగాల నిలిపివేతపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!!