Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అస్వస్థతకు గురైన కవిత.. ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరిక

Kavitha

సెల్వి

, గురువారం, 22 ఆగస్టు 2024 (13:40 IST)
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను ఢిల్లీని ఎయిమ్స్‌కు తరలించారు. కవిత గత ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 
 
కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతకుముందు, జులై 16న కవిత జైల్లోనే అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆమెకు జ్వరం రావడంతో పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్‌లో గల దీనదయాళ్ ఆసుపత్రికి తరలించారు.  వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా వల్లే పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకోపోయింది.. ఆనం రామనారాయణ రెడ్డి