Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కు నిప్పంచిన కస్టమర్.. కారణం అదే? (video)

OLA

సెల్వి

, బుధవారం, 11 సెప్టెంబరు 2024 (17:46 IST)
OLA
ఇటీవల కొనుగోలు చేసిన ఇ-స్కూటర్‌కు సర్వీసింగ్ సంతృప్తికరంగా లేకపోవడంతో కర్ణాటకలోని కలబురగిలోని ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కు నిప్పుపెట్టినందుకు 26 ఏళ్ల కస్టమర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. కలబురగిలో వృత్తిరీత్యా మెకానిక్ అయిన మహ్మద్ నదీమ్ ఈ-స్కూటర్‌ను ఆగస్టు 2024లో కొనుగోలు చేశారు. స్కూటర్‌లో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత, అతను దానిని చాలాసార్లు సర్వీస్ కోసం తిరిగి ఇచ్చాడు.
 
సర్వీసింగ్‌ సంతృప్తికరంగా లేదు. దీంతో ఆగ్రహానికి గురైన నదీమ్ మంగళవారం పెట్రోలు తీసుకొచ్చి షోరూములోని ఆరు బైక్‌లకు నిప్పంటించాడు అని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. షోరూమ్‌కు రూ.850,000 నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తి తగాదాలు.. ముగ్గురు హతం.. గర్భవతి అని కూడా చూడకుండా?