Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటకలో ఘోరం : రెండు ఆటోలను ఢీకొన్న లారీ.. 11 మంది కూలీల దర్మరణం

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఒక టెంపో ట్రావెలర్, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం చిత్రదుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద జరిగింది

కర్ణాటకలో ఘోరం : రెండు ఆటోలను ఢీకొన్న లారీ.. 11 మంది కూలీల దర్మరణం
, శనివారం, 18 మార్చి 2017 (15:35 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఒక టెంపో ట్రావెలర్, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం చిత్రదుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద జరిగింది. 
 
ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్న స‌హాయ‌క బృందాలు గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నాయి. గాయాల‌పాల‌యిన వారు టెంపో ట్రావెల‌ర్‌లో ప్ర‌యాణిస్తోన్న వార‌ని పోలీసులు తెలిపారు. ఆటోల్లో ప్ర‌యాణిస్తూ మృతి చెందిన వారంతా విజ‌య‌పుర జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల కన్నా తపాలానే మిన్న...! సర్వీస్ చార్జ్ లేని ఏటీఎం కార్డు