Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వదినతో వివాహేతర సంబంధం.. భర్త దుబాయ్‌లో.. చంపాలనుకున్నారు.. కానీ?

Advertiesment
వదినతో వివాహేతర సంబంధం.. భర్త దుబాయ్‌లో.. చంపాలనుకున్నారు.. కానీ?
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (12:38 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని హర్బర్ సింగారతోపు అనే గ్రామంలో ఓ మహిళ తన భర్త అంబుమలితో కలిసి జీవనం సాగిస్తోంది. అంబుమలి డబ్బు సంపాదన కోసం దుబాయ్ వెళ్లాడు. కాగా తన సోదరుడు మహేష్‌ను వదినకు తోడుగా ఉండమని చెప్పాడు. దీంతో మహేష్ తన సోదరుడి ఇంటికి చేరాడు. 
 
మహేష్ తన సోదరుడి ఇంట్లో బాగానే వున్నాడు. వదినకు అన్ని పనులు చేసి పెట్టేవాడు. అయితే భర్త దూరంగా ఉండటంతో ఆమె బుద్ధి మారింది. మహేష్‌ను తన శారీరక వాంఛలు తీర్చుకునేందుకు వాడటం మొదలెట్టింది. మహేష్ కూడా తన వదినతో శారీరకంగా పలుమార్లు కలిశాడు.

ఇలా భర్త ఏళ్ల తరబడి దుబాయ్‌లోనే ఉండటంతో మరిదితో ఎంజాయ్ చేయటం మొదలెట్టింది. అన్నభార్య అనికూడా చూడకుండా అతను ఆమెతో ఎఫైర్ కొనసాగించటం మొదలెట్టాడు. ఈ క్రమంలో బావమరది పెళ్ళికి  భారత్ వచ్చిన ఆ వ్యక్తికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి ఆమెను తీవ్రంగా మందలించాడు.
 
దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె మరిది సాయంతో గ్యాస్ లీక్ చేసి చంపాలనుకుంది. అయితే తృటిలో తప్పించుకున్న అంబుమలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల గురించి గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలును భయపెడుతున్న కరోనా... పెరిగిపోతున్న కేసులు... ప్రజల్లో భయం