Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకు రెండో పెళ్లి చేసి పెట్టిన భార్య.. మగ సంతానం కోసం బాలికను కిడ్నాప్ చేసి?

Advertiesment
భర్తకు రెండో పెళ్లి చేసి పెట్టిన భార్య.. మగ సంతానం కోసం బాలికను కిడ్నాప్ చేసి?
, సోమవారం, 11 నవంబరు 2019 (11:04 IST)
భర్తకు రెండో పెళ్లి చేసేందుకు భార్య తెగించింది. తనకు ముగ్గురు అమ్మాయిలు పుట్టడంతో వారసుడు కావాలని ఆమె తపించింది. ఎలాగైనా వారసుడు కావాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఓ బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ గుడికి తీసుకెళ్లి తన భర్తతో వివాహం జరిపించింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కడలూరు, దిట్టకుడి ఉల్లవయ్యంగుడికి చెందిన అశోక్‌కుమార్-చెల్లకిళి దంపతులు ముగ్గురు అమ్మాయిలు వున్నారు. ఈ దంపతులు మగపిల్లాడి కోసం స్థానికంగా నివసించే ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు. ఈ నెల 7న అమ్మాయి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బాలికను తమతోపాటు ఆలయానికి తీసుకెళ్లారు.
 
అందరూ కలిసి గుడికి చేరుకున్న తర్వాత చెల్లకిళి తమ ప్లాన్‌ను అమలు చేసింది. తన భర్తతో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది. అయితే, గుడికి వెళ్లిన తమ కుమార్తె మూడు రోజులైనా రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు చెల్లకిళిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె భర్త అశోక్ కుమార్ కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్‌కు సంకటం.. కమల వికాసం