Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. కాశ్మీర్‌లో టీచర్ మృతి

రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. కాశ్మీర్‌లో టీచర్ మృతి
, మంగళవారం, 31 మే 2022 (15:54 IST)
కాశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా గోపాలపొర ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
జమ్ము డివిజన్‌లోని సాంబాకి వలస వచ్చిన ఆమె ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.  లోయలో ఇటీవల చెలరేగిపోతున్న ఉగ్రవాదులు ఈ నెల 12న బుద్గాంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి అయిన రాహుల్ భట్‌ను కాల్చి చంపారు. 
 
గత వారం ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌ను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. తాజాగా, ఇప్పుడు ఉపాధ్యాయురాలిని హత్య చేశారు. 
 
ఈ ఘటనపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇది చాలా విచారకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దోవాస్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్