Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిన్న అనంత.. నేడు జార్ఖండ్.. లాఠీకి పనిచెప్పిన పోలీసులు

నిన్న.. అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది ఓ ప్రయాణీకుడిపై చేజేసుకున్నాడు. సురేష్ అనే యువకుడు జనరల్ టికెట్ తీసుకుని బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు కదులుతున్నప్పుడు స్లీపర్ కోచ్ ఎక్

నిన్న అనంత.. నేడు జార్ఖండ్.. లాఠీకి పనిచెప్పిన పోలీసులు
, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (13:40 IST)
నిన్న.. అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది ఓ ప్రయాణీకుడిపై చేజేసుకున్నాడు. సురేష్ అనే యువకుడు జనరల్ టికెట్ తీసుకుని బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు కదులుతున్నప్పుడు స్లీపర్ కోచ్ ఎక్కాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది సురేష్‌ను రైలు నుంచి దించారు.

రైలు కదలడంతోనే స్లీపర్ కోచ్ హడావుడిలో ఎక్కానని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేసింది. లాఠీతో సురేష్‌ను చితకబాదాడు. ఫ్లాట్ ఫామ్‌లోనే కాకుండా.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మరోవైపు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలోని జూబ్లీపార్క్ వద్ద నడిరోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు కర్రలతో కొట్టారు. మతిస్థిమితంలేని వ్యక్తిపై పోలీసులు చేజేసుకోవడానికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు స్మార్ట్ ఫోన్ల ద్వారా రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మీడియా ఆ పోలీసులను ప్రశ్నించగా... రోడ్డుపై నుంచి పక్కకు పంపడానికి తాము అతడిని భయపెట్టాలని మాత్రమే చూశామని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : పవన్ కల్యాణ్