Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

Advertiesment
amit shah

ఠాగూర్

, శనివారం, 21 జూన్ 2025 (11:53 IST)
పాకిస్థాన్ వెళ్లాల్సిన నీళ్లను రాజస్థాన్‌కు మళ్లించి, పాకిస్థాన్ గొంతు ఎండాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిన ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు.
 
ఆయన తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం. కానీ, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్‌కు ఉంది. అదే చేశాం. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాల శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచారు. కానీ, ఒకసారి దీన్ని ఉల్లంఘిస్తే రక్షించడానికి ఇంకేమీ ఉండదు అని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 
 
భారత్‌కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తాం. కెనాల్‌ను నిర్మించి పాకిస్థాన్‌కు వెళ్ళే నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తాం. ఇన్నాళ్లూ పాక్ అన్యాయంగా నీటిని అందుకుంది. ఇకపై ఆ దేశం గొంతు ఎండాల్సిందే అని అన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు