Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలాం ద్వీపం నుంచి అగ్ని-3 క్షిపణి ప్రయోగం సక్సెస్

Advertiesment
agni 3 missile
, గురువారం, 24 నవంబరు 2022 (07:32 IST)
ఒరిస్సా సముద్రతీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి చేపట్టిన అగ్ని-3క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యంతర క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినట్టు భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్డీవో వెల్లడించింది. 
 
సాధారణంగా సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్యంతర అగ్ని-3 పరీక్ష విజయవంతంగా ముగిసినట్టు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యాలను ఈ క్షిపణి చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ అగ్ని-3 క్షిపణి శ్రేణిలో గతంలో 2006 జూన్ 9వ తేదీన మొదటిసారిగా ప్రయోగించారు. ఈ క్షిపణఇ అణు వార్‌హెడ్‌ తీసుకెళ్లి 3500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. రెండో క్షిపణిని 2007లో విజయవంతంగా ప్రయోగించారు. 2008లో వరుసగా మూడోసారి ప్రయోగించారు. ఇపుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణిని ప్రయోగించగా అది పూర్తిగా విజయవంతమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు