Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యమా.. నో ఛాన్స్: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స

కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యమా.. నో ఛాన్స్: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
, బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:26 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ స్పందిస్తూ అమెరికాకు ఝలక్ ఇచ్చారు. భారతదేశం ప్రారంభం నుంచి విదేశీ వ్యవహారాల్లో తనకంటూ ఓ పద్ధతిని అవలంబిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి భారత్-పాక్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి మూడో దేశం జోక్యాన్ని.. చివరకు ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కూడా అంగీకరించడం లేదు. 
 
అదే భారత విదేశాంగ విధానం. అయితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్పర్ధలు సవరించేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియరాగానే.. భారత్ స్పందించింది. అమెరికా వివాదాస్పద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ విషయంలో రంగంలోకి దిగి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం రాగానే.. భారత్ ఎన్నటికీ తృతీయ దేశం జోక్యాన్ని సహించదు.
 
ఇంకా భారత్- పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించు కోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. తద్వారా మూడో దేశ ప్రమేయాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా భారత్ తిరస్కరించింది. ఈ ప్రకటన ప్రధాని మోడీ ఆదేశాల మేరక విడుదలైనట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిరియాలో మారణహోమం.. రసాయనిక దాడి.. 100 మంది చిన్నారుల మృత్యువాత