Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిరియాలో మారణహోమం.. రసాయనిక దాడి.. 100 మంది చిన్నారుల మృత్యువాత

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు.

Advertiesment
Chemical attack
, బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:12 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 400 మంది శ్వాసకోస ఇబ్బందులతో బాధపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా మెడికల్ రిలీఫ్ గ్రూప్ పేర్కొంది.
 
రసాయన దాడి తర్వాత చిన్నారులు నేలపైపడి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యాలను మీడియా ప్రసారం చేయడంతో ప్రపంచ దేశాలు సైతం ఉలిక్కిపడ్డాయి. ఈ చర్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుబట్టింది. ఉగ్రవాదులను అణచివేసే పద్ధతి ఇది కాదంటూ మండిపడ్డాయి. 
 
దీంతో స్పందించిన సిరియా రసాయన దాడి వార్త అవాస్తవమని, తాము రసాయన ఆయుధాలను ఉపయోగించలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఉపయోగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 
 
మరోవైపు సిరియా సైన్యమే ఈ దాడికి పాల్పడిందని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంఘం ఆరోపించింది. దాడిలో పలువురు చిన్నారులు సహా కనీసం వందమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొదట కేసీఆర్, తర్వాత చంద్రబాబు.. ఇప్పుడు గవర్నర్.. అందరూ ప్రజాస్వామ్య హంతకులేనా?