Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

కరోనా: 24 గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు.. 67మంది మృతి

Advertiesment
Corona
, శనివారం, 23 జులై 2022 (11:10 IST)
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 20,726 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... 67మంది మృతి చెందారు. 
 
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. ప్రస్తుతం దేశంలో 1,50,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,31,92,379 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,25,997 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా, క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మంకీ పాక్స్ అలజడి.. కేరళలో మూడో కేసు