Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐఎన్ఎస్ కరాంజ్ జలప్రవేశం

భారత నౌకాదళంలోకి మరో కొత్త జలాంతర్గామి ప్రవేశించింది. స్కార్పీన్‌ శ్రేణికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ కరాంజ్‌ జలప్రవేశం చేసింది.

ఐఎన్ఎస్ కరాంజ్ జలప్రవేశం
, బుధవారం, 31 జనవరి 2018 (12:22 IST)
భారత నౌకాదళంలోకి మరో కొత్త జలాంతర్గామి ప్రవేశించింది. స్కార్పీన్‌ శ్రేణికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ కరాంజ్‌ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా, ఆయన సతీమణి రీనా లంబా జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఒక యేడాది పాటు ఈ జలాంతర్గామిని క్షుణ్ణంగా పరీక్షించినట్టు సునీల్‌ లంబా తెలిపారు. 
 
ఈ జలాంతర్గామిని ముంబైలోని మజగావ్‌ డాక్‌యార్డ్‌లో నిర్మించారు. ఈ సిరీస్‌లో భాగంగా, మొత్తం ఆరు జలాంతర్గాములను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. అయితే, జలాంతర్గాముల తయారీ ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతండ్రి కాదు.. రాక్షసుడు... పిల్లలు బట్టలు మురికి చేస్తున్నారనీ... (వీడియో)