Publish Date: Tue, 09 Apr 2024 (16:13 IST)
Updated Date: Tue, 09 Apr 2024 (16:15 IST)
2024లో భారత్లో సాధారణ రుతుపవనాలు నమోదవుతాయని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మంగళవారం తెలిపింది. గత ఏడాది అస్థిరమైన రుతుపవనాల వల్ల దెబ్బతిన్న దేశ వ్యవసాయ రంగానికి ఇది శుభవార్త. స్కైమెట్ ప్రకారం, జూన్ నుండి సెప్టెంబరు వరకు నాలుగు నెలల కాలానికి రుతుపవనాల వర్షాలు దీర్ఘకాల సగటు 868.6 మిమీలో 102 శాతంగా అంచనా వేయబడ్డాయి.
దేశంలోని దక్షిణ, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల్లో "తగినంత మంచి వర్షాలు" కురుస్తాయని అంచనా వేసింది. దేశంలోని దాదాపు సగానికి పైగా వ్యవసాయ విస్తీర్ణం నీటిపారుదల సౌకర్యం లేనిది, పంటలను పండించడానికి వర్షాలపై ఆధారపడి ఉంది. ఈ రుతుపవనాలతో దేశంలోని నీటి రిజర్వాయర్లు నిండుతాయని, తదుపరి నీటిపారుదల కోసం ఉపయోగించవచ్చని నిర్ధారించడం జరిగింది.