Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుదుచ్చేరి జిప్మర్‌లో హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం..

, మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (11:36 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన జిప్మర్‍‌లో ఏర్పాటుచేసిన ఓ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లి లైంగికదాడికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాండిచ్చేరి పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిలో ఒకడు కామాంధ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. మరొక నిందితుడు ఈ కానిస్టేబుల్ స్నేహితుడు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేశారు. 
 
జిప్మర్‌లో వారం రోజుల పాటు జరిగే ఓ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి 20 యేళ్ల విద్యార్థిని వచ్చింది. ఈ విద్యార్థిని గురువారం రాత్రి ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియం ప్రాంగణంలో వాకింగ్ చేస్తూ కనిపించింది. 
 
ఆ సమయంలో బైకుపై వచ్చిన పుదుచ్చేరి కానిస్టేబుల్ కన్నన్ (31), ఆయన స్నేహితుడు శివలు కలిసి ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి అక్కడ నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అమర్చివున్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Happy National Defence Day.. సరిహద్దుకు కాపలా.. జవాన్లకు జై