Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

Advertiesment
First Freight

సెల్వి

, శనివారం, 9 ఆగస్టు 2025 (17:32 IST)
First Freight
జమ్మూ కాశ్మీర్‌కు ఒక చారిత్రాత్మక మైలురాయిగా, మొదటి సరుకు రవాణా రైలు శనివారం రాజధాని శ్రీనగర్‌కు దక్షిణంగా 55 కి.మీ దూరంలో ఉన్న అనంతనాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఇది కాశ్మీర్ లోయ, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడంలో ఒక ప్రధాన అడుగుగా నిలిచింది. 
 
ఈ సంవత్సరం జూన్‌లో ప్రత్యక్ష రైలు సేవలు ప్రారంభమవడంతో, ఈ అభివృద్ధి ఆర్థిక- రవాణా సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇది సుందరమైన హిమాలయ ప్రాంతానికి వాణిజ్యం, రవాణాను సులభతరం చేస్తుంది. సిమెంట్‌తో నిండిన ఈ రైలును స్థానికులు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక అడుగుగా జరుపుకున్నారని ఒక అధికారి తెలిపారు. 
 
అనంతనాగ్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇన్‌కమింగ్ - అవుట్‌గోయింగ్ సరుకు రవాణాను నిర్వహించడానికి సన్నద్ధమైందని 272 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్ ఉధంపూర్, రియాసి, రాంబన్, శ్రీనగర్, అనంతనాగ్, పుల్వామా, బుడ్గామ్, బారాముల్లాలను కలుపుతుంది. 
 
ఇది కాశ్మీర్‌ను ఇండియన్ రైల్వేస్ సరుకు రవాణా కారిడార్‌తో అనుసంధానిస్తుందని, భారతదేశం అంతటా ప్రత్యక్ష సరుకు రవాణాను సాధ్యం చేస్తుంది ఉధంపూర్, రియాసి, రాంబన్, శ్రీనగర్, అనంతనాగ్, పుల్వామా, బుద్గాం, బారాముల్లాలను యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్ విస్తరించి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం