Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: ఉద్యోగులకు స్ఫూర్తి కోసం హెచ్‌సీసీబీ కస్టమైజ్డ్‌ వర్ట్యువల్‌ ఎంగేజ్‌మెంట్‌

కరోనావైరస్: ఉద్యోగులకు స్ఫూర్తి కోసం హెచ్‌సీసీబీ కస్టమైజ్డ్‌ వర్ట్యువల్‌ ఎంగేజ్‌మెంట్‌
, బుధవారం, 19 ఆగస్టు 2020 (16:19 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్‌ కోకా- కోలా బేవరేజస్‌ (హెచ్‌సీసీబీ) పలు వర్ట్యువల్‌ ఎంప్లాయీ ఎంగేజమెంట్‌ కార్యక్రమాలను పరిచయం చేసింది. ప్రస్తుత మహమ్మారి వేళ తమ ఉద్యోగులకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా సుదీర్ఘకాలం కోసం వారిని సిద్ధం చేసేందుకు దీనిని లక్ష్యంగా చేసుకున్నారు. అధికశాతం మంది ఉద్యోగులు విభిన్న భౌగోళిక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న కారణంగా, హెచ్‌సీసీబీ ప్రత్యేకంగా కస్టమైజ్డ్‌ ఆన్‌లైన్‌ కార్యక్రమాలను ఉద్యోగులను ఎంగేజ్‌ చేయడానికి రూపొందించింది.
 
ప్రస్తుత మమహ్మారి సమయంలో భౌతికంగా దగ్గర ఉంటూ పనిచేసే అవకాశాలను తోసిపుచ్చిన వేళ  నూతన పనిమార్గాలను అవలంభించిన మరియు అనుసరించిన హెచ్‌సీసీబీ ఉద్యోగులకు ఈ వర్ట్యువల్‌ ఎంపాలయీ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు, ఫ్యాక్టరీలు, డిపోలలోని అసోసియేట్లు మరియు క్షేత్ర రంగంలోని సేల్స్‌ సిబ్బంది కోసం రూపకల్పన చేసిన ఈ వర్ట్యువల్‌ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలను వారంలోని విభిన్న రోజుల కోసం విస్తరించారు.
 
ఉదాహరణకు ‘ద లెర్నింగ్‌ హవర్‌’. దీనిలో డిజిటల్‌ కార్యకలాపాలతో వెబినార్లు ఉంటాయి. వీటిని బృందాలు లేదా జంటలుగా నిర్వహించడం ద్వారా ఉద్యోగులకు నూతన అంతర్దృష్టులు మరియు జ్ఞానాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం, శుక్రవారం జరుగుతుంది. అలాగే ‘వెల్‌నెస్‌ హవర్‌’. దీనిలో నిష్ణాతులు, ఉద్యోగుల యొక్క మానసిక మరియు శారీరక సంక్షేమం పై దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక సదస్సులు చేస్తారు.
 
ఈ కార్యక్రమం ప్రతి గురువారం జరుగుతుంది. ‘ద టాక్‌ షోస్‌’ అనేది అనధికార సదస్సు. దీనిని ఆఫీసు పనిగంటలు ముగిసిన తరువాత నిర్వహిస్తారు. దీనిలో ఉద్యోగులు వర్ట్యువల్‌గా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని సాయంత్రపు డ్రింక్స్‌తో సహా అందిస్తారు. ఈ సమయంలో తమకు అభిరుచి కలిగిన పలు అంశాలపై మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని వారం విడిచి వారం శుక్రవారం రోజున ఆఫీసు పనిగంటలు ముగిసిన తరువాత సాయంత్రపు వేళలో నిర్వహిస్తారు. వీటితో పాటుగా కంపెనీకి చెందిన ‘హ్యాపీనెస్‌ టీమ్‌’, వర్ట్యువల్‌ టాలెంట్‌ షోస్‌ను ఇంటి నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తుంది.
 
అదనంగా, హెచ్‌సీసీబీ పలు వర్ట్యువల్‌ ట్రైనింగ్‌ సదస్సులను తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తుంది. ఈ సదస్సులను తమ ఉద్యోగులు పలు రంగాలలో తమ నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది తమ ఉద్యోగులు అనుసంధానితం కావడంతో పాటుగా అభ్యసిస్తూ, వృద్ధి చెందేందుకు వేదికగా సైతం పనిచేస్తుంది. మొత్తంమ్మీద 25వేల గంటల ఈ తరహా శిక్షణను క్రమం తప్పని వెబినార్ల ద్వారా అందించారు.
 
దీనితో పాటుగా కంపెనీ యొక్క డిజిటల్‌ శిక్షణాకార్యక్రమాలైనటువంటి ప్రతిష్టాత్మక హార్వార్డ్‌ మేనేజ్‌ మెంటార్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ కూడా భాగంగా ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ ఆన్‌లైన్‌ అభ్యాస పోర్టల్స్‌లో ఒకటిగా ఇది గుర్తింపు పొందినది. వీటితో పాటుగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఆన్‌లైన్‌ కోర్సు లింకెడిన్‌ లెర్నింగ్‌ సైతం అందించడం ద్వారా తాము కోరుకున్న కెరీర్‌ మరియు అందుకు అవసరమైన నైపుణ్యాల నడుమ ఖాళీని పూరిస్తున్నారు.
 
విభిన్నమైన ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేయడం వెనుక కారణాలను గురించి శ్రీ ఇంద్రజీత్‌ సేన్‌గుప్తా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్శెస్‌ ఆఫీసర్‌, హెచ్‌సీసీబీ మాట్లాడుతూ ‘‘ఉద్యోగుల శారీరక, మానసిక, భావోద్వేగ సంక్షేమం పట్ల మేము ఆందోళనగా ఉన్నాము. మారుతున్న పని వాతావరణాన్ని వేగంగా, ఎలాంటి భయం, ఆందోళన లేకుండా స్వీకరించడంతో పాటుగా దానికనుగుణంగా తమను తాము మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాము.
 
మా ఉద్యోగుల పలు ఆసక్తులను పరిగణలోకి తీసుకుని ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశాము. సంభావ్య బర్న్‌ఔట్స్‌ నివారించడానికి అవసరమైన విరామాలను సైతంఇది అందిస్తుంది. ఓ నియమంగా,  ఈ కార్యక్రమాలన్నీ కూడా ఐశ్చికం మరియు స్వచ్ఛందంగా ఉండేలా రూపకల్పన చేశాం. అందువల్ల మా ఉద్యోగులకు అవసరమైన వశ్యతను అందిస్తుంది’’ అని అన్నారు.
 
అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్‌ 21, 2020వ తేదీన హెచ్‌సీసీబీ ఓ మ్యూజిక్‌ ప్లేలిస్ట్‌ను విడుదల చేసింది.  తద్వారా తమ అసోసియేట్లు ఇంటి వద్దనే ఉండటంతో పాటుగా తమ కుటుంబ సభ్యులతో  కలిసి యోగాను ప్రాక్టీస్‌ చేయవచ్చు.ఈ  ప్లే లిస్ట్‌ను హెచ్‌సీసీబీ కోసం డాక్టర్‌ ఇళయరాజా స్వరపరిచిన సంగీత నేపథ్యం ఆధారంగా రూపొందించారు.
 
తమ ఉద్యోగుల కుటుంబ సభ్యులను గుర్తించేందుకు సైతం హెచ్‌సీసీబీ ఓ కార్యక్రమం పరిచయం చేసింది. ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు అధిక సమయం పనిచేసేందుకు తోడ్పాటునందిస్తున్న అసలైన మద్దతు వ్యవస్ధ వారు. ఉదాహరణకు, ఈ కంపెనీ ఓ ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌- ఇంకింగ్‌ విత్‌ టింకిల్‌ను నిర్వహించింది. దీనిలో చిన్నారులు మరింతగా అభ్యసించి, నేర్చుకునే అవకాశం కలిగింది.
 
ఈ కంపెనీ, సాంకేతిక విలీనాలపై ఆధారపడి, నూతన చాట్‌బాట్‌ను పరిచయం చేసింది. దీనిద్వారా తమ ఉద్యోగులతో వాస్తవ సమయంలో ఈ మహమ్మారి సమయంలో సంభాషించే అవకాశం కలుగుతుంది. కంపెనీ యొక్క ఇంట్రానెట్‌పై ఓ ప్రత్యేక విభాగాన్ని సైతం సృష్టించారు. తద్వారా తమ ఉద్యోగులకు అన్ని కోవిడ్‌-19 సంబంధిత సందేహాలను పరిష్కరించే అవకాశం కలుగుతుంది. ఈ కంపెనీ తమ ఉద్యోగుల కోసం చాట్‌బాట్‌పై ఓ ఫీచర్‌ను సైతం ఆవిష్కరించింది. దీనిద్వారా ఉద్యోగులు తమ రోజువారీ ఆరోగ్య స్థితి అప్‌డేట్‌ చేయవచ్చు మరియు అవసరమైతే వైద్య సహాయం, కౌన్సిలింగ్‌ సైతం పొందవచ్చు.
 
వీటితో పాటుగా, హెచ్‌సీసీబీ తమ వర్ట్యువల్‌ టౌన్‌హాల్స్‌పై విభిన్న విభాగాలను పరిచయం చేసింది. దీనిలో కంపెనీ యొక్క సీఈవో, సీనియర్‌ లీడర్‌షిప్‌తో అన్ని నెలవారీ టౌన్‌హాల్స్‌ భాగంగా ఉంటాయి.
 
అంతేకాకుండా ఫంక్షనల్‌, జోనల్‌ మరియు క్లస్టర్‌ టౌన్‌హాల్స్‌ కూడా భాగంగా ఉంటాయి. వినూత్న ప్రయత్నంలో, హెచ్‌సీసీబీ ఎంపిక చేసిన థర్డ్‌ పార్టీ భాగస్వాముల గ్రూప్‌లతో వర్ట్యువల్‌ టౌన్‌హాల్స్‌  నిర్వహించింది. తద్వారా ఈ మహమ్మారి వేళ తమ మద్దతును విస్తరించింది. ఈ టౌన్‌హాల్స్‌ నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశ్యం ఉద్యోగుల భద్రత మరియు సంక్షేమం పట్ల అసలైన స్పందనను చూపడం మరియు మహమ్మారి వేళ విజేతగా నిలిచేందుకు కంపెనీ వ్యాపార వ్యూహాలు మరియు అనుసరిస్తున్న దిశను గురించి పంచుకోవడం మరియు కంపెనీ పనితీరు పట్ల స్పష్టత నందించడం.
 
తమ ఫ్యాక్టరీ అసోసియేట్ల కోసం హెచ్‌సీసీబీ, వర్ట్యువల్‌ ఫ్యామిలీ డే, మ్యూజిక్‌ సెషన్స్‌ మరియు పలు క్రీడలను నిర్వహించింది. ఈ క్రీడలను భౌతిక దూరం అనుసరిస్తూ ఆడేలా తీర్చిదిద్దారు. వీటిలో తంబోలా, హౌసీ వంటివి ఉన్నాయి.ఈ క్రీడల ద్వారా గెలుచుకున్న మొత్తాలలో  కొంత భాగాన్ని పీఎం కేర్‌ ఫండ్‌కు అందించారు. అదే రీతిలో, దీని సేల్స్‌ బృందాలు కోసం, హెచ్‌సీసీబీ పలు కార్యక్రమాలైనటువంటి వర్ట్యువల్‌ రికగ్నైజేషన్‌ కార్యక్రమంను సేల్స్‌ పనితీరు.
 
అవార్డులు, ప్రోత్సాహక వేడుకలతో పాటుగా టాలెంట్‌ షోస్‌ సైతం నిర్వహించింది. ఈ కార్యక్రమాలు ఫ్యాక్టరీ యొక్క మరో కోణాన్ని వెలికి తీసుకువచ్చాయి. అలాగే సేల్స్‌ వర్కర్లలోని మరో కోణాన్ని సైతం వెలికి తీసుకువచ్చాయి. సాధారణ పనిదినాలలో ఇవన్నీ గుర్తించకుండానే పోతాయి. అన్ని స్థాయిలలోని ఉద్యోగులు కంపెనీ తమ ఉద్యోగులను ఆన్‌లైన్‌లో చేరుకోవడానికి చేపట్టిన ఈ కార్యక్రమాలను చక్కగా స్వీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహబూబ్ నగర్ జిల్లాలో మట్టి ఇల్లు కూలి తల్లి, ఇద్దరు పిల్లలు మరణం