తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో ఒక యోగా టీచర్ను సజీవంగా పాతిపెట్టిన ఘటన హర్యానా రాష్ట్రంలో చక్రిదాద్రిలో వెలుగులోకి వచ్చింది. మహిళ భర్త.. యోగా టీచర్ను ఏడు అడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. బాధితుడు జగదీప్ రోహ్తక్లోని ఓ ప్రైవేటు యూనివర్శిటీలో యోగా టీచర్. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత ఈ నెల 24వ జగదీప్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.
పోలీసుల కథనం మేరకు.. డిసెంబరు 24వ తేదీన జగదీశ్ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవనంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్బంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు ధర్మపాల్, హర్దీప్లను పోలీసులను అరెస్ట్ చేశారు.
విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడించాడు. నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితుడు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది.