Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏటీఎం క్యూలైన్లలో సాధారణ ప్రజలు.. పని ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది ప్రాణాలు పోతున్నాయ్

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అనేక మందికి ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా... ఏటీఎం‌లలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు క్యూలైన్లలో నిలబడలేక

ఏటీఎం క్యూలైన్లలో సాధారణ ప్రజలు.. పని ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది ప్రాణాలు పోతున్నాయ్
, సోమవారం, 19 డిశెంబరు 2016 (15:29 IST)
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అనేక మందికి ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా... ఏటీఎం‌లలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు క్యూలైన్లలో నిలబడలేక సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఇప్పటికే పదుల సంఖ్యలో ఉంది. 
 
తాజాగా బ్యాంకులో పని ఒత్తిడిని తట్టుకోలేక క్యాషియర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒకటి గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. పెద్దనోట్ల రద్దు నేప‌థ్యంలో దేశంలోని అన్ని బ్యాంకుల ముందు ఖాతాదారులు భారీ సంఖ్య‌లో చేరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌ని పెరిగి, కొంద‌రు బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. 
 
ఈ నేప‌థ్యంలోనే గుజరాత్‌లోని థారడ్‌లో భారత స్టేట్ బ్యాంకు శాఖ‌లో క్యాషియ‌ర్‌గా ప‌నిచేస్తోన్న‌ ప్రేమ్‌ శంకర్‌ ప్రజాపతి అనే వ్యక్తి శనివారం సాయంత్రం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. ప‌నిలో ఒత్తిడి వ‌ల్లే త‌న భ‌ర్త ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని ప్రేమ్ శంకర్ భార్య తెలిపింది. 
 
కొన్ని రోజుల నుంచి తన భర్త ఇంట్లో ఎవ‌రితోనూ మట్లాడ‌కుండా త‌న‌లో తానే బాధ‌ప‌డిపోతున్నాడ‌ని చెప్పింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ శంక‌ర్‌ది స్వ‌స్థ‌లం రాజస్థాన్‌‌లోని బార్మర్‌ అనే ప్రాంతం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో రాజధాని నిర్మాణం.. 53,478 ఎకరాలలో అత్యంత సుందరంగా..?