Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన సినీ నటి ప్రగ్యా జైస్వాల్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్:  మొక్కలు నాటిన సినీ నటి ప్రగ్యా జైస్వాల్
, మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:45 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నూతన ఉత్సాహంతో ముందుకు కొనసాగుతుంది. ప్రముఖులు ఒకరి నుండి  ఒకరు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపుతున్నారు. 

నటి పాయల్ రాజ్ పుత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ప్రజ్ఞ జస్వాల్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. మొక్కల నుండి వచ్చే ఆక్సిజన్ తోనే మనం ఈ రోజు జీవనం కొనసాగిస్తున్నా.

మనకు ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ను మనం చాలా డబ్బులు ఖర్చు చేసి కోనడం జరుగుతుంది. అలాంటి ఆక్సిజన్ ఉచితం గా ఇచ్చే మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత మనందరిపై ఉన్నది. ప్రతి మనిషి కనీసం మూడు మొక్కలు నాటా"లని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందు తీసుకబోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కి అభినందనలు తెలియజేశారు.

ఈ చాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని, అందులో భాగంగా సినీ నటి రెజీనా కసండ్రా, డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రముఖ యోగా గురు అనుష్క లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి  మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
 
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు "వృక్ష వేదం" పుస్తకంను ప్రజ్ఞా జైస్వాల్ కు అందజేయడం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుకే స్ట్రెయిన్ ఏపిలో విస్తరించినట్లు దాఖలాల్లేవు: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ