Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమోసాలు తీసిస్తానని తాత, మేనమామ బాలికపై గ్యాంగ్ రేప్.. రూ.20లను ఇచ్చి..?

Advertiesment
సమోసాలు తీసిస్తానని తాత, మేనమామ బాలికపై గ్యాంగ్ రేప్.. రూ.20లను ఇచ్చి..?
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:34 IST)
మహిళలపై వయోబేధం లేకుండా, వావి వరుసలు లేకుండా లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు తగ్గట్లేదు. తాజాగా ఆరేళ్ల బాలికపై ఆమె తాతయ్య, మేనమామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. 
 
బాలిక సోదరుడి ముందే వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది రోజుల కిందట జరిగిన ఈ ఘోరం గురువారం సాయంత్రం వెల్లడైంది. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయం బాధితురాలు వివరించింది.
 
ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదైంది. కొద్దిరోజుల కిందట తన మేనమామ సమోసాలు ఇస్తానని తనను, తన సోదరుడిని బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ అప్పటికే తాత ఉన్నాడని బాధితురాలు పేర్కొంది. 
 
వారు సోదరుడి ఎదుటే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది. నిందితులు బాలికకు రూ.20 ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కోరారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ కొండెక్కిన పసిడి ధరలు.. వరుసగా నాలుగో రోజు..?