Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ కొండెక్కిన పసిడి ధరలు.. వరుసగా నాలుగో రోజు..?

Advertiesment
మళ్లీ కొండెక్కిన పసిడి ధరలు.. వరుసగా నాలుగో రోజు..?
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:27 IST)
పసిడి ధర మళ్లీ కొండెక్కుతోంది. పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనిస్తోంది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.
 
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.
 
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరుగుదలతో రూ.47,460కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.500 పెరుగుదలతో రూ.43,500కు ఎగసింది. 
 
బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వదినను లోబరుచుకుని ఆమెను రాష్ట్రం దాటించేసి...