Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: జనరల్ బోగీల్లో సీట్లకు రిజర్వేషన్ అవసరంలేదు

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: జనరల్ బోగీల్లో సీట్లకు రిజర్వేషన్ అవసరంలేదు
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:31 IST)
రైళ్లలోని జనరల్‌ బోగీల్లో ఇక కొవిడ్‌కు ముందు మాదిరే ప్రయాణం చేయవచ్చు. రిజర్వేషన్‌ అవసరం లేదు. స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్‌ టికెట్‌ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చు. 
 
ఈ నిర్ణయం 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని అయితే హైదరాబాద్‌ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలుచేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే సోమవారం తెలిపింది.
 
జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్‌ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం - ముద్దాయికి 20 యేళ్ళ జైలు