Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాయమాటలు చెప్పిన లాడ్జీకి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి ప్రేయసిపై ప్రియుడి అత్యాచారం

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార

మాయమాటలు చెప్పిన లాడ్జీకి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి ప్రేయసిపై ప్రియుడి అత్యాచారం
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (08:39 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార్థినిని నిర్బంధించి అత్యాచారం జరిపిన ఆమె ప్రేమికుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నాగర్‌కోవిల్‌లోని ఓ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఈ నెల ఉన్నట్టుండి కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలించగా ఆమె లాడ్జిలో నిర్బంధంలో ఉన్నట్టు తెలిపారు. 
 
పోలీసులు జరిపిన విచారణలో అసలు విషయం బట్టబయలైంది. ఆ విద్యార్థినిని మాయమాటలతో లాడ్జికి తరలించిన ప్రేమికుడు సురేశ్ అత్యాచారం జరిపాడని, ఆ తర్వాత తన స్నేహితులు గోపాల్‌, దినేశ్, జ్ఞానప్రవీణ్‌ అనే ముగ్గురిని పిలిపించి వారితో ఈ నీచపు పనికి ఒడిగట్టాడు. వారితో ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉడకబెట్టిన యాపిల్ పండ్లను ఆరగిస్తున్న జయలలిత... మెరుగు పడుతున్న ఆరోగ్యం