Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరునల్వేలిలో నల్ల కుబేరులు ఏం చేశారో తెలుసా? ఫ్రీగా పెట్రోల్ పోయమని పారిపోయారు..

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తిరునెల్వేలిలో శనివారం వేకువజామున పెద్దనోట్లు మెండుగా కలిగిన నల్ల ధనవంతులు రెండు పెట్రోలు బంకులకు లక్ష రూపాయలను దానం చేశారు. తామిచ్చిన డబ్బు

తిరునల్వేలిలో నల్ల కుబేరులు ఏం చేశారో తెలుసా? ఫ్రీగా పెట్రోల్ పోయమని పారిపోయారు..
, శనివారం, 19 నవంబరు 2016 (19:29 IST)
పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తిరునెల్వేలిలో శనివారం వేకువజామున  పెద్దనోట్లు మెండుగా కలిగిన నల్ల ధనవంతులు రెండు పెట్రోలు బంకులకు లక్ష రూపాయలను దానం చేశారు. తామిచ్చిన డబ్బులు పూర్తయ్యేంతవరకు ఆటోలకు ఉచితంగా పెట్రోలు పోయాలని చెప్పి క్షణాలలో పారిపోయారు. ఇక అప్పటి నుండి ఆ రెండు పెట్రోలు బంకుల వద్ద వందల సంఖ్యలో ఆటోలు బారులుతీరాయి.  
 
తిరునల్వేలి పాత బస్టాండు వద్దనున్న ఓ పెట్రోలు బంక్‌కు, మేలపాళయంలోనున్న మరో పెట్రోలు బంక్‌కు శనివారం వేకువజామున మోటారు బైకులపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చెలామణీ రద్దయిన ఐదొందలు, వెయ్యిరూపాయల నోట్లకట్టలను రూ.50 వేల దాకా బంక్‌ నిర్వాహకులకు ఇచ్చి వెళ్ళిపోయారు. దీంతో సదరు పెట్రోల్ బంక్ వద్ద ఆటోలు భారీ  సంఖ్యలో క్యూలో నిలిచాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధనమిచ్చిన నల్ల కుబేరుల కోసం దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ ఆరోగ్యం భేష్.. ప్రత్యేక వార్డుకు తరలింపు.. ఇక అమ్మ ఇష్ట ప్రకారమే డిశ్చార్జ్..