Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ ఆరోగ్యం భేష్.. ప్రత్యేక వార్డుకు తరలింపు.. ఇక అమ్మ ఇష్ట ప్రకారమే డిశ్చార్జ్..

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదుటపడింది. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత గత 58 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెను అపోలో వైద్యులు ఎంసీసీయూ నుంచి ప్రత్యేక వార్డు

Advertiesment
Time to Discharge CM Jayalalitha Apollo Hospital Chief Said to Media
, శనివారం, 19 నవంబరు 2016 (19:14 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదుటపడింది. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత గత 58 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెను అపోలో వైద్యులు ఎంసీసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు శనివారం తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం వందశాతం కుదుటపడిందని అపోలో ఆసుపత్రి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు.
 
శుక్రవారం ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత చాలా రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆమెకు సోకిన ఇన్ ఫెక్షన్ పూర్తిగా నయమైందని తెలిపారు. జయలలితకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందని భావించి తాము ఐసీయూలోనే పెట్టామని తెలిపారు. జయలలిత ఎప్పటిలాగే అందరితో మాట్లాడుతున్నారని, ఆమె తన శ్రేయోభిలాషులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. ప్రస్తుతం జయలలిత విశ్రాంతి మాత్రం తీసుకుంటున్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
అయితే డిశ్చార్జ్ అయ్యే విషయంపై జయలలితనే నిర్ణయం తీసుకుంటారని, ఆమె ఇష్ట ప్రకారమే డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే అమ్మ పూర్తిగా కోలుకున్నారని వార్త వినగానే అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు పెద్ద నోట్లు రద్దు చేస్తే ఎలా.. మా ఆదాయం సంగతేంటి : మోడీతో కేసీఆర్