Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమతా బెనర్జీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. దుర్గాపూజ సెలవులతో?

మమతా బెనర్జీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. దుర్గాపూజ సెలవులతో?
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:23 IST)
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నబన్నాలోని సచివాలయం 14వ అంతస్తులో ఉన్న సీఎం మమతా కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి.
 
కార్యాలయంలో నుంచి పొగలు రావడం గమనించిన ప‌క్క‌నే గ్రౌండ్‌లో పని చేస్తున్న కార్మికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్‌ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
 
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. దుర్గాపూజ సందర్భంగా సెలవు కారణంగా సచివాలయాన్ని మూసివేశారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులాభారం మొక్కు తీర్చుకున్న ముఖ్య‌మంత్రి జగన్