Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈఎంఐ కట్టలేదని కిడ్నాప్ చేశారు... చివరికి ఏమైందంటే?

Advertiesment
Finance
, శనివారం, 1 జులై 2023 (22:22 IST)
తమిళనాడులో ఘోరం జరిగింది. అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల ఫైనాన్స్ కంపెనీ దారుణంగా ప్రవర్తించింది. ఈఎంఐ కట్టలేదని.. సదరు ఫైనాన్స్ కంపెనీ.. ఆతని కుమార్తెను కిడ్నాప్ చేసిన ఘటన తిరునెల్వేలి జిల్లా మారుత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మారుత్తూరు గ్రామానికి చెందిన రాజా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 
 
ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 50 వేలు అతను అప్పు తీసుకున్నాడు. లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టాడు. కానీ ఉద్యోగం పోవడంతో డబ్బుల్లేక నానా తంటాలు పడ్డాడు. అయితే అప్పు తీసుకున్న కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
ఓ రోజు ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి విఘ్నేష్.. లోన్ తీసుకున్న రాజా ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా.. ఈఎంఐ వసూలు చేయాలని అనుకున్నాడు. రాజా ఇంటికి వెళ్లి ఆవేశంలో ఆయన 11ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు. 
 
రాజా ఇంటికి వచ్చాక కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్లా వెతకడం ప్రారంభించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన రాజా కుమార్తెను కాపాడి.. విఘ్నేశ్‌ను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ సెక్యూరిటీ స్కీం శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించిన ఇండియన్ బ్యాంక్