భారతీయ జనతా పార్టీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. మొన్నటికిమొన్న భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ను టార్గెట్ చేసిన స్వామి.. ఇపుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటపడ్డారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 1980లో ఖరగ్పూర్ ఐఐటీలో కేజ్రీవాల్ మెకానికల్ ఇంజినీరింగ్లో బీటెక్ హానర్స్ చదివారని.. అయితే, కేజ్రీవాల్ను ఐఐటీలో ఎలా చేర్చుకున్నారో? జేఈఈ వంటి ఎంట్రెన్స్ పరీక్షల్లో ఆయనకు జాతీయ స్థాయిలో ఎంత ర్యాంకు వచ్చిందో తెలియజేయాలని తాను ఆర్టీఐ ద్వారా కోరగా ఆ సమాచారం తమ వద్ద లేదని ఆ ఐఐటీ సమాధానం పంపినట్లు స్వామి పేర్కొన్నారు.