Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30 వరకు విదేశీయుల వీసా గడువు పెంపు

30 వరకు విదేశీయుల వీసా గడువు పెంపు
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (08:16 IST)
భారత్​లో ఉన్న విదేశీయుల వీసా గడువును  కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. గడువు ముగిసేంతవరకు సాధారణ వీసా లేదా ఈ-వీసా కలిగిన వారు.. ఎలాంటి ఓవర్ స్టే పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
 
అఫ్గాన్ పౌరులకు సైతం.. ఈ గడువు వర్తిస్తుందని తెలిపింది. కొవిడ్​ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దై.. స్వదేశానికి వెళ్లలేక పోయిన విదేశీయులకు వీసా గడువు పొడిగించింది భారత ప్రభుత్వం. 
 
అంతకుముందు ఆగస్టు 31వరకు ఉన్న గడువును.. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  అన్ని రకాల వీసాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
 
మార్చి, 2021 వరకు వివిధ రకాల వీసాల ద్వారా భారత్​కు వచ్చి కరోనా కారణంగా విమాన సర్వీసులు రద్దై.. భారత్​లోనే చిక్కుకున్న వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికార ప్రతినిధి తెలిపారు. 
 
భారత్​లో ఉన్న విదేశీయులకు.. ఎలాంటి ఓవర్​ స్టే పెనాల్టీ విధించకుండా వీసా గడువును పొడిగిస్తున్నామన్నారు. విదేశీయులు.. ఫారనర్స్ రీజనల్​​ రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లో(ఎఫ్​ఆర్​ఆర్​ఓ) ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.

ఎవరికైనా సెప్టెంబర్ 30 తర్వాత కూడా.. వీసా గడువు కావాలంటే ఎఫ్​ఆర్​ఆర్​ఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసు కోవాలన్నారు. అఫ్గాన్ పౌరులకు కూడా.. ఇదివరకు చెప్పిన విధంగానే గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్సైజ్ సీఐతో ప్రైవేటు స్కూల్‌ నిర్వహకురాలి ఎఫైర్.. ఇద్దరు కలిసి పారిపోతుండగా ఏం జరిగిందంటే?!