Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెమోరియల్ హౌస్‌గా మారనున్న జయలలిత నివాసం (video)

మెమోరియల్ హౌస్‌గా మారనున్న జయలలిత నివాసం (video)
, శుక్రవారం, 22 మే 2020 (09:47 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం స్మారక మందిరంగా మారనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దీంతో చెన్నై, తేనాంపేట, పోయస్ గార్డెన్‌లో ఉన్న జయలలిత నివాసమైన వేదా నిలయం మెమోరియల్ హౌస్‌గా మారనుంది. 
 
జయలలిత అనారోగ్య కారణంగా గత 2016 డిసెంబరు ఐదో తేదీన చనిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమెకు చెందిన ఆస్తులపై ఆమె ప్రియ నెచ్చెలి శశికళతోపాటు.. జయలలిత అన్న కుమార్తె దీపా పోటాపోటీగా హక్కులు ప్రకటించారు. జయలలిత ఆస్తులకు తామే వాసులమంటూ ప్రకటనలు ఇచ్చారు. 
 
దీంతో రాష్ట్ర ప్రభుత్వం జయలలిత పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ కోర్టు ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుంది. అదేసమయంలో జయలలిత అధికారిక నివాసమైన పోయస్ గార్డెన్‌ను మాత్రం స్మారక నిలయంగా ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ చర్యల్లో భాగంగా, ఇపుడు వేదా నిలయాన్ని మెమోరియల్ హౌస్‌గా మార్చేందుకు వీలుకల్పించే ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడికి 26 - ఆమెకు 40 .. పెళ్లి చేసుకోమని వెంటపడిందనీ చంపేశాడు... ఎక్కడ?