Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి రోజున వరుస భూకంపాలు.. వణికిపోయిన జనాలు

దీపావళి రోజున వరుస భూకంపాలు.. వణికిపోయిన జనాలు
, గురువారం, 4 నవంబరు 2021 (14:41 IST)
దీపావళి రోజున వరుస భూకంపాలు జనాలను వణికించాయి. వరుస భూ కంపాలు అస్సాంతో పాటు ఈశాన్య రాష్ర్టాలను నిలువెల్లా వణికించాయి. పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతినగా… ప్రజలు ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.
 
ప్రకంపనల సమయంలో వేర్వేరుచోట్ల ఒకరు షాక్‌తో, మరొకరు గుండెపోటుతో మరణించారు. నాలుగు జిల్లాల్లో 10 మంది గాయపడ్డారు. అస్సాంలోని సోనిత్‌పూర్‌ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం 7.51 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.4గా నమోదైంది. 
 
దాని ప్రభావం ఈశాన్యంతో పాటు పశ్చిమ బెంగాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. దీని తర్వాత మధ్యాహ్నంలోపు మరో 10 భూకంపాలు సంభవించాయి. వాటి తీవ్రత మొదటిదాని కంటే తక్కువగానే నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి భూకంప ప్రభావంపై ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నౌషేరాలో మోదీ దీపావళి పండుగ..