Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరకట్నం వేధింపులతో భార్య ఆత్మహత్య.. భర్త జైలుకు.. పోలీసులే అత్తకు వైద్యం ఇప్పించారు..

వరకట్న మృతి కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, దోషి అయిన భర్తను జైలుకు పంపించిన కేసులో... వయసు మళ్లి పక్షవాతంతో బాధపడుతున్న ఓ తల్లిని చూసుకునే బాధ్యతలను కోర్టు ఢిల్లీ పోలీసులకు అప్ప

వరకట్నం వేధింపులతో భార్య ఆత్మహత్య.. భర్త జైలుకు.. పోలీసులే అత్తకు వైద్యం ఇప్పించారు..
, గురువారం, 6 అక్టోబరు 2016 (18:41 IST)
వరకట్న మృతి కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, దోషి అయిన భర్తను జైలుకు పంపించిన కేసులో... వయసు మళ్లి పక్షవాతంతో బాధపడుతున్న ఓ తల్లిని చూసుకునే బాధ్యతలను కోర్టు ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, పితాంపురాకు చెందిన ఓ వ్యక్తికి 2013 ఫిబ్రవరిలో ఓ మహిళతో వివాహమైంది. 
 
ఇది వీరిద్దరికీ రెండో పెళ్లి.. భర్త తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి పాలవడంతో వైద్య ఖర్చుల కోసం పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని భార్యను వేధించాడు. పలుసార్లు తన పుట్టింటివారితో ఈ విషయం చెప్పి వాపోయినా వారు పట్టించుకోకపోవడంతో.. 2013 జూన్ 2న అత్తవారింట్లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న మృతిగా నమోదైన ఈ కేసులో నిందితుడైన భర్తకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. 
 
అదే సమయంలో పక్షవాతంతో బాధపడుతున్న నిందితుడి తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. వృద్ధురాలి బాగోగోలపై ఢిల్లీ పోలీసులదే బాధ్యత అంటూ ఆదేశాలు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పించి.. సరైన వైద్యం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాకు పాక్ వార్నింగ్: కాశ్మీర్‌పై పట్టించుకోకపోతే.. రష్యా, చైనాతో కలిసీ....