Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెనుకబడిన రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష హిందీ : డీఎంకే ఎంపీ

tsk elangovan
, మంగళవారం, 7 జూన్ 2022 (10:59 IST)
దేశంలో ఉత్తర, దక్షిణాది చర్చ జరుగుతోంది. మరోవైపు, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలంటూ కేంద్రంలోని బీజేపీ పాలకులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో దేశంలో హిందీ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ వెనుకబడిన రాష్ట్రాల భాష అంటూ వ్యాఖ్యానించారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే హిందీ ఎక్కువగా మాట్లాడుతారని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో బాగా వెనుకబడివున్నాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "వెస్ట్ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలను చూడండి.. ఇవన్నీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజలకు హిందీ మాతృభాష కాదు" అని వివరించారు. 
 
అంతేకాదు, హిందీ మనల్ని శూద్రుల్లా మార్చేస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్ల హిందీని స్వీకరించడం ఏమాత్రం మంచిదికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం" - వ్యవసాయానికి ప్రభుత్వ సాయం