Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెటర్లపై ‘దీపిక’ మీటూ ఆరోపణలు

క్రికెటర్లపై ‘దీపిక’ మీటూ ఆరోపణలు
, శనివారం, 12 అక్టోబరు 2019 (15:02 IST)
బాలీవుడ్ నటి  దీపిక పదుకొనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీటూ వివాదంలోకి భారత క్రికెటర్లు సహా విదేశీ క్రికెటర్లను లాగింది.

సినీ పరిశ్రమలోనే కాదు మహిళలను వేధించిన వారిలో క్రికెటర్లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు.. పలువురు పారిశ్రామిక వేత్తలు అంటూ ఆ రంగాన్ని కూడా వేలెత్తి చూపించడం సంచలనంగా మారింది. సినిమా నిర్మాతలు.. దర్శకులు అంతా వేధించిన వారైతే.. క్రికెటర్లు ఏమైనా మహత్ములా అంటూ దీపిక కాస్తంత ఘాటుగానే ప్రశ్నించింది.

తన వరకూ లైంగిక  వేధింపులేవి ఎదురవ్వనప్పటికీ బాధితులను చూసి బాధ కలిగిందని వాపోయింది. సినిమా వాళ్లనే కాదు…క్రికెటర్లను ప్రశ్నించాలని  ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెటర్లలో కొందరు మంచి వాళ్లు ఉన్నారు. చెడ్డ వారు ఉన్నారు.

కానీ వారిపై వచ్చిన ఆరోపణలు మాత్రం హైలైట్ కాలేదు. మీడియా దాన్ని ఫోకస్ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకన్ క్రికెటర్లు అర్జున రణతుంగ- లసిత్ మలింగ పేర్లతో పాటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ పేరు మీటూ ఉద్యమంలో  భాగంగా వినిపించించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ సరిహద్దుల్లో సాయుధ బలగాల మోహరింపు