Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

Advertiesment
Delhi Assembly results

ఐవీఆర్

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:53 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ పార్టీ 46 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండగా ఆప్ కేవలం 23 చోట్ల ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ పార్టీ 1 చోట ముందంజలో వుంది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను భాజపా దాటేసింది. దీనితో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
 
మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో వున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీ (BJP) నుండి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, భారత జాతీయ కాంగ్రెస్ (INC) నుండి సందీప్ దీక్షిత్ వంటి కీలక అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
 
తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అరవింద్ కేజ్రీవాల్ నాల్గవసారి ముఖ్యమంత్రి అవుతారని AAP ధీమా వ్యక్తం చేసింది. కానీ అగ్ర నాయకులు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అతిషి తమ తమ స్థానాల్లో వెనుకబడి ఉన్నారని ప్రారంభ ధోరణులు సూచిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం