Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడి రోడ్డుపై దళిత మహిళను చావబాదిన పోలీసు...

police latti charge
, సోమవారం, 1 జనవరి 2024 (16:26 IST)
బీహార్‌లో కొత్త సంవత్సరం రోజున ఒక అమానుష ఘటన జరిగింది. నడి రోడ్డుపై దళిత మహిళపై ఓ కానిస్టేబుల్ లాఠీతో విరుచుకుపడ్డాడు. తన వద్ద ఉండే లాఠీతో ఆమెను చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సీతామర్హికి చెందిన ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి బాలికను రక్షించినట్లు వెల్లడించారు. కిడ్నాప్‌ వ్యవహారంలో బాలికకు సంబంధించిన పలువురు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారిలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పారు. 
 
వారు రోడ్డుపై గొడవకు దిగడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడిందన్నారు. పోలీసులు వచ్చినా గొడవ ఆపకపోవడంతో వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో లాఠీతో కొట్టినట్లు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
 
మరోవైపు, నడి రోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌లో నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీని ప్రయోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజిటల్ చెల్లింపుల విధానంలో మార్పులు...