Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాన్నమ్మపై దాడి చేసిన దంపతులు... భర్త పట్టుకుంటే.. భార్య చెక్కతో..?

crime scene

సెల్వి

, గురువారం, 28 మార్చి 2024 (13:08 IST)
ఆధునిక పోకడలతో మానవత్వం మంటగలిసిపోతుంది. తాజాగా భోపాల్‌కు చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జంట వారి నాన్నమ్మపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను గుర్తించిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వృద్ధురాలిని గట్టిగా పట్టుకోవడం చూడవచ్చు, అతని భార్య ఆమెను చెక్కతో కొట్టినట్లు కనిపిస్తుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా, దీపక్ సేన్-పూజా సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందినవారని గుర్తించారు.  భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ జంటను అరెస్టు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీపక్ బర్ఖేడీ ప్రాంతంలో బార్బర్ షాప్ నడుపుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబాయ్‌ని ఎవరు చంపారో అందరికీ బాగా తెలుసు.. జగన్