Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో కరోనా కొత్త రికార్డు.. మహారాష్ట్రలో డేంజర్ బెల్స్

దేశంలో కరోనా కొత్త రికార్డు.. మహారాష్ట్రలో డేంజర్ బెల్స్
, గురువారం, 25 మార్చి 2021 (10:49 IST)
దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,65,021 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా...53,476 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక కరోనా మరణాలు కూడా 24 గంటల వ్యవధిలో 251 నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు 1,17,87,534 కేసులు నమోదయ్యాయి. 
 
ఇందులో 1,12,31,650 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 3,95,192 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,60,692కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 26,490 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
మరోవైపు మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇలానే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వరకూ మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. 
 
అత్యధికంగా పుణె జిల్లాలో (61,125), తర్వాత నాగ్‌పూర్ (47,707), ముంబై (32,927)లలో అధిక కేసులు ఉన్నాయి. వచ్చే 11 రోజుల్లో మరణాల సంఖ్య కూడా 64 వేలు దాటనుందని అంచనా. ప్రస్తతం ప్రతి వారం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1 శాతం మేర పెరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏలూరు ఓట్ల లెక్కింపు కేసు ఏప్రిల్‌ 1కి వాయిదా