Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటక పీఠం కాంగ్రెస్‌ పార్టీదే.. తాజా సర్వేలో వెల్లడి

karnataka poll
, మంగళవారం, 2 మే 2023 (15:17 IST)
ఈ నెల పదో తేదీన కర్నాటక అసెంబ్లీకి పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ముందస్తు సర్వేలు చేస్తున్నాయి. ఇప్పటివరకు  చేసిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగిస్తుందని వెల్లడించాయి. తాజాగా ఇండియా టు డే - సీ ఓటర్ సంస్థలు కలిసి నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ సర్వే ఫలితాల్లో అధికార బీజేపీకి 74 నుంచి 86 సీట్లు వస్తాయని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి 107 నుంచి 119 సీట్ల వరకు వస్తాయని ఈ సర్వే తెలిపింది. 
 
కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. అయితే, బీజేపీ గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఈ 20 నుంచి 25 సీట్లు తక్కువగా వస్తాయని తెలిపింది. అదేసమయంలో జేడీఎస్ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించి.. 23 నుంచి 35 సీట్లను గెలుచుకోవచ్చని తెలిపింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా నిరుద్యోగం 31 శాతం, మౌలిక వసతుల కల్పన 24 శాతం, విద్యా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాల కల్పన 14 శాతం, అవినీతి 13 శాతం చొప్పున ప్రభావం చూపే అంశాలుగా ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి కొత్త ఆప్షన్.. సైడ్-బై-సైడ్ ఫీచర్