Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవై కారు బాంబు పేలుడు.. తమిళనాడులో ఎన్.ఐ.ఏ సోదాలు

nia logo
, గురువారం, 10 నవంబరు 2022 (13:25 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, గురువారం ఎన్.ఐ.ఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గత నెల 23వ తేదీన కోయంబత్తూరు నగరంలో కారు బాంబు పేలుడు సంభవించింది. మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్‌ పేలుడు సంభవించింది. కొట్టాయ్ ఈశ్వర్ ఆలయం ముందు భాగంలో ఈ పేలుడు జరిగి జమేజా ముబిన్ అనే వ్యక్తి మరణించాడు. 
దీనిపై ఎన్.ఐ.ఏ కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్సో విభాగం దర్యాప్తు చేస్తోంది. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, తమిళనాడు పోలీసులు త్వరితగతిన స్పందించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పుదుపేట, మన్నాడు, జమాలియా, పెరంబూరు, కోయంబత్తూరులోని కొట్టైమేడు, ఉక్కడంతో సహా మొత్తం 40 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాలూ ప్రసాద్ యాదవ్‌కు పునర్జన్మను ప్రసాదించనున్న కుమార్తె?