Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగ్ని-V టెస్ట్.. చైనా వణుకు.. ఎందుకంటే?

అగ్ని-V టెస్ట్.. చైనా వణుకు.. ఎందుకంటే?
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:36 IST)
అగ్ని-V టెస్ట్ నిర్వహించడం భారత్​కు ఇది తొలిసారి కాకపోయినా.. డ్రాగన్ దేశం చైనా ఈసారి మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ టెస్టుల తర్వాత భారత రక్షణ దళం అమ్ములపొదిలోకి ఈ ఖండాంతర అగ్ని క్షిపణి చేరనుంది. దీంతో భారత సాయుధ దళానికి మరింత బలం చేకూరినట్టవుతుంది. అసలు అగ్ని- V విషయంలో చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది. 
 
అగ్ని- V.. భారత తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం). 5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. దశాబ్దకాలం పాటు దీని తయారీ ప్రక్రియ జరిగింది. అనుకున్న సుదూర లక్ష్యాన్ని అగ్ని- V విజయవంతంగా ఛేదించిందని 2018 జనవరిలో నిర్వహించిన ఐదో పరీక్ష తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
 
అయితే, ఒకే ఏడాది రెండుసార్లు టెస్ట్ చేశాక సాయుధ దళాలకు అగ్ని- Vను అప్పగించాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్​, డిసెంబర్​లో క్షిపణి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇది ఆలస్యమైంది. అయితే తదుపరి టెస్టు సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే మిసైల్​కు ఇదే తొలి యూజర్ ట్రైల్స్ అని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌కు కర్రుకాల్చి వాతపెట్టిన ఇండియన్ లేడీ!