జయలలిత ఆరోగ్యం భేష్.. వైద్యానికి స్పందిస్తున్నారు : అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. కాగా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత ఇటీవల వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఈనెల 22వ తేదీన చేరిన విషయం తెల్సిందే.
అయితే, ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు వచ్చాయి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తమిళనాడు రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోమారు ఆమె ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. దీంతో అపోలో వైద్యులు ఆరోగ్య బులిటెన్ను విడుదల చేశారు.
చెన్నై, గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో గౌరవనీయ ముఖ్యమంత్రి జయలలితకు జ్వరం రావడంతో వైద్యం కోసం ఇటీవల చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అందిస్తున్న వైద్యానికి స్పందిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సలహా ఇచ్చారని తెలిపింది.