Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చనుబాలు తాగేటప్పుడు నొప్పి... మగబిడ్డను చంపేసిన తల్లి.. ఎక్కడ?

ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆపై పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో కానీ.. తన కన్నబిడ్డను ఆ తల్లి బావిలో వేసి హతమార్చింది. ఈ ఘటన చెన్నై వేళచ్చేరిలో చోటుచేసుకుంది.

చనుబాలు తాగేటప్పుడు నొప్పి... మగబిడ్డను చంపేసిన తల్లి.. ఎక్కడ?
, సోమవారం, 8 అక్టోబరు 2018 (12:01 IST)
ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆపై పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో కానీ.. తన కన్నబిడ్డను ఆ తల్లి బావిలో వేసి హతమార్చింది. ఈ ఘటన చెన్నై వేళచ్చేరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేళచ్చేరికి చెందిన వెంకన్న (30), ఉమా (27) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలకు ముందు ఉమకు పండంటి మగబిడ్డ పుట్టాడు. 
 
అయితే శుక్రవారం రాత్రి భార్యాభర్తలు బిడ్డను పక్కనబెట్టుకుని నిద్రపోగా, శనివారం వేకువజామున ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉదయం నిద్రలేచిన భార్యాభర్తలు చూస్తే మగబిడ్డ కనిపించలేదు. దీంతో వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో అసలు విషయం తేల్చారు. 
 
కన్నబిడ్డను ఉమానే హతమార్చి కిడ్నాప్ డ్రామా చేసిందని కనుగొన్నారు. ఇంకా ఉమా వద్ద జరిపిన విచారణలో కూడా ఆమే తన బిడ్డను చంపేసినట్లు అంగీకరించింది. కానీ బిడ్డను చంపినందుకు అసలు కారణం మాత్రం పోలీసులకు షాక్‌నిచ్చింది. 
 
తొలికాన్పులో మగబిడ్డ పుట్టినందుకు సంతోషించాల్సిపోయి.. ఆ బిడ్డ చనుబాలు తాగేటప్పుడు రొమ్ములో తీవ్రమైన నొప్పి రావడం వల్లే హత్యచేసి, ప్లాస్టిక్ సంచిలో కట్టి పాడుబడిన బావిలో విసిరేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది. దీన్ని విన్న పోలీసులు షాక్ అయ్యారు. కానీ ఆమె మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు భావిస్తున్నారు. ఉమా మానసిక రోగిగా వుండచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ ఇంటికి వచ్చే పాము.. అర్థరాత్రి నగ్నంగా మహిళ పూజలు..