Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిటికల్ కండిషన్‌లో కరుణానిధి.. ఈపీఎస్ - ఓపీఎస్ పరామర్శ.. చెన్నైలో హైఅలెర్ట్

డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇదిలావుంటే, కరుణానిధిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్

క్రిటికల్ కండిషన్‌లో కరుణానిధి.. ఈపీఎస్ - ఓపీఎస్ పరామర్శ.. చెన్నైలో హైఅలెర్ట్
, సోమవారం, 30 జులై 2018 (11:24 IST)
డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇదిలావుంటే, కరుణానిధిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, రాష్ట్ర మంత్రులు సోమవారం పరామర్శించారు.
 
వారంతా కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రికి చేరుకున్న వారిద్దరూ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడారు. కరుణానిధికి అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు కరుణానిధిని పరామర్శించారు. 
 
మరోవైపు కరుణానిధి ఆరోగ్యంపై డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ కంగారుపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కావేరీ ఆస్పత్రి పరిసరాల్లో ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించింది. సుమారు 3 వేల మంది పోలీసులు ఆస్పత్రి, డీఎంకే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తక్షణం రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, చెన్నై నగర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైట్ కబ్బుల్లో వ్యభిచార దందా... క్లబ్ డ్యాన్సర్లే వ్యభిచారిణిలుగా...